యాప్నగరం

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఉత్తర్వులు వచ్చేశాయి

Ap Govt Added Cancer Treatments In Employees Health Scheme ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 46 రకాల చికిత్సలను చేర్చారు. వీటిని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా రిటైర్డ్ అయిన వారికి కూడా ట్రీట్మెంట్. ఈ మేరకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు కూడా ఆదేశాలు పంపారు. తాజా నిర్ణయంపై ఉద్యోగులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 20 Apr 2023, 6:22 am

ప్రధానాంశాలు:

  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
  • హెల్త్ స్కీమ్‌లోకి మరో 46 రకాల చికిత్సలు
  • ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్యశాఖ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ap Govt Decision On Employees Health Scheme
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఏపీ ఉద్యోగులకి మేలు కలిగేలా వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ లోకి అదనంగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలని శాశ్వతంగా చేరుస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు వచ్చాయి. ప్రతీ ఏటా రెన్యువల్ చేయాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలు చేర్చారు.
సర్జికల్ ఆంకాలజీలో పది, మెడికల్ ఆంకాలజీలో 32, రేడియేషన్ ఆంకాలజీలో 4 క్యాన్సర్ రకాలని ఉద్యోగుల హెల్త్ స్కీంలో శాశ్వతంగా చేర్చింది వైద్య శాఖ. ఈ సదుపాయం రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పదవీ విరమణ చెందిన‌ ఉద్యోగులకి అనుబంధ ఆసుపత్రులలో కొత్తగా చేర్చిన 46 చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోను ఆదేశించారు. జగన్ సర్కార్ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి.

ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య చికిత్సలకు అవసరమయ్యే మొత్తాన్ని ఆస్పత్రులకు సమకూరుస్తున్నారు. ఎవరైనా ఉద్యోగులు అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తే ఈ పథకం ద్వారా వారికి ఉచితంగా అనుబంధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తారు. ఉద్యోగులకు వైద్యం అందించేందుకు వీలుగా ఈ స్కీమ్‌లో ఎప్పటికప్పుడు వివిధ రకాల చికిత్సలను అప్ డేట్ చేయాల్సి ఉంది. తాజా నిర్ణయంతో ఉద్యోగులకు మరికొంత ఊరట లభించిందనే చెప్పాలి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మరో సమస్య తీరింది.

మరోవైపు విద్యుత్‌ సంస్థల ఉద్యోగుల వేతన సవరణ కమిటీ సమీక్ష ఈ నెల 26కు వాయిదా పడింది. వాస్తవానికి ఈ సమీక్ష గురువారం జరగాల్సి ఉంది.. కానీ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఢిల్లీకి వెళ్లారు. ఈ టీమ్‌లో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ కూడా ఉన్నారు. దీంతో విద్యుత్‌ సంస్థల ఉద్యోగుల పీఆర్‌సీ సమీక్షను 26కి వాయిదా వేశారు. ఉద్యోగులు విషయాన్ని గమనించాలన్నారు.

ఇదిలా ఉంటే.. కియా మోటార్స్‌ సంస్థ ఏపీ పోలీసుశాఖ కోసం ప్రత్యేకంగా వాహనాలను తయారు చేసింది. కియా మోటార్స్‌ ప్రతినిధులు పోలీసు ప్రధాన కార్యాలయంలో వీటిని ప్రదర్శించారు. రెండు వాహనాలను డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి పరిశీలించారు. ఈ వాహనాల్లో కల్పించాల్సిన అదనపు సదుపాయాలు గురించి డీజీపీ వారికి సూచించారు. వీటిలో ఒకటి గస్తీ వాహనం.. మరొకటి ఇంటర్‌సెప్టర్‌ వాహనం.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.