యాప్నగరం

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. 9 మంది కరోనా బాధితుల డిశ్చార్జి

AP Corona Cases: రాష్ట్రంలో 9 మంది కరోనా బాధితులను డిశ్చార్జి చేసినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం ఒక్కరోజే ముగ్గురిని డిశ్చార్జి చేసినట్లు పేర్కొంది.

Samayam Telugu 8 Apr 2020, 11:17 pm
కరోనా వైరస్ (కోవిడ్ 19) మహమ్మారి రాష్ట్రంలో తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రజలకు వైసీపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనాతో బాధపడుతున్న మొత్తం 9 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా వారిని డిశ్చార్జి చేశారు. బుధవారం ఒక్క రోజే విశాఖపట్నంలో ముగ్గురిని డిశ్చార్జి చేశారు. దీంతో రాష్ట్రంలో డిశ్చార్జి అయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. బుధవారం మధ్యాహ్నం వరకు ఈ సంఖ్య ఆరుగా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.
Samayam Telugu corona hospital


కాగా, రాష్ట్రంలో బుధవారం రాత్రికి 348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో బుధవారం ఒక్కరోజే 34 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 49 కేసులు, నెల్లూరులో 48 కేసుల చొప్పున నమోదయ్యాయి.

అలాగే విశాఖపట్నం జిల్లాలో మొత్తం నలుగురు కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశంలో ఒకరు, తూర్పు గోదావరిలో ఒకరు, నెల్లూరులో ఒకరు చొప్పున మొత్తం 9 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.