యాప్నగరం

జగన్ సర్కార్ మరో గుడ్‌న్యూస్.. వారికి ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం..

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్ అందించింది జగన్ సర్కార్. చేతివృత్తిపై ఆధారపడి బతుకుతున్న నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఏటా పది వేల ఆర్థిక సాయం అందించనుంది.

Samayam Telugu 31 Jan 2020, 10:52 pm
సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న సీఎం వైఎస్ జగన్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఆర్థిక సాయమందిచేందుకు జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. త్వరలోనే పథకాన్ని ప్రారంభించేందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు ప్రారంభించారు.
Samayam Telugu cabinet 4


జగనన్న చేదోడులో భాగంగా ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. ఐదేళ్లపాటు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణచించింది. ఈ మేరకు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జగన్ సర్కార్ పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది.

Also Read:
జేసీ దివాకర్ రెడ్డికి జగన్ భారీ షాక్.. వైఎస్ నిర్ణయానికి భిన్నంగా..

ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేలు జమ చేసింది. ఇప్పటికే తొలి విడత అమ్మ ఒడి డబ్బులు జమ చేసిన ప్రభుత్వం.. రెండోవిడత జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఆటోడ్రైవర్లకు ఏటా పది వేల రూపాయలు అందజేసింది. కేన్సర్ సహా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు పింఛన్లు అందజేస్తోంది. తాజాగా నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకుల వంటి చేతివృత్తుల వారికి చేయూతనిచ్చేందుకు జగనన్న చేదోడు పథకం అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.