యాప్నగరం

చంద్రబాబు బస్సుపై దాడి.. విచారణకు సిట్ ఏర్పాటు

చంద్రబాబు అమరావతి పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమపై దాడి జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. డీజీపీ వైఖరినీ తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో అమరావతి పర్యటనలో జరిగిన పరిణామాలపై దర్యాప్తు జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Samayam Telugu 1 Dec 2019, 5:07 pm
చంద్రబాబు అమరావతి పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఏపీ పోలీస్ బాస్ గౌతం సవాంగ్ ఆదేశాలతో గుంటూరు అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటైంది. కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు విసరడం.. సంఘటన సమయంలో పోలీసుల అలసత్వం తదితర విషయాలపై సిట్ విచారణ జరపనుంది.
Samayam Telugu chandrababu


పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే అవాంఛనీయ ఘటనలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు పర్యటనలో పోలీసులు నిర్లక్షంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అమరావతి పర్యటనలో చోటుచేసుకున్న పరిణామాలపై సమగ్ర విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.

Also Read: ‘టీటీడీ వెబ్‌సైట్‌లో శ్రీయేసయ్య.. తిరుమల పవిత్రతను మంటగలుపుతున్న జగన్’

చంద్రబాబు బస్సుపై చెప్పులు, రాళ్లు విసిరినట్లుగా అనుమానిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. మందడం గ్రామానికి చెందిన బాపయ్య, ఉద్దండరాయుని పాలేనికి చెందిన సందీప్ అనే ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.
వారిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేయడంతో తుళ్లూరులో నమోదైన కేసులను కూడా సిట్‌కు బదిలీ చేశారు. వారం రోజుల్లో సిట్ బృందం ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.