యాప్నగరం

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. అర్చకులు, ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులకు శుభవార్త

Ap State Agama Advisory Board ను నియమించారు. ఆగమ సలహా బోర్డు ఛైర్మన్‌గా వైఖానస ఆగమ ప్రవర డాక్టర్‌ వేదాంతం సత్యశ్రీనివాస అయ్యంగార్‌కు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం. మొత్తం 12 ఆగమాలకు సంబంధించిన వారు సభ్యులుగా ఉన్నారు. దేవాదాయ అర్చకులు, ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేసిన సర్కార్. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అర్చకులు, ఆలయాల్లో ఉద్యోగులకు వివిధ సంక్షేమం కోసం.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 11 Jan 2023, 7:30 am

ప్రధానాంశాలు:

  • ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
  • రాష్ట్ర ఆగమ సలహా బోర్డును నియమించింది
  • ఛైర్మన్‌గా వేదాంతం సత్యశ్రీనివాస అయ్యంగార్‌
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ap State Agama Advisory Board
Andhra Pradesh State Agama Board ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆగమ సలహా బోర్డును ఏర్పాటు చేసింది. ఛైర్మన్‌తోపాటు 12 ఆగమాలకు చెందిన సభ్యులతో బోర్డును డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. ఆగమ సలహా బోర్డు ఛైర్మన్‌గా వైఖానస ఆగమ ప్రవర డాక్టర్‌ వేదాంతం సత్యశ్రీనివాస అయ్యంగార్‌ను నియమించినట్లు తెలిపారు.
ఈ బోర్డులో సభ్యులుగా సంస్కృత పండితులు మహా మహోపాధ్యాయ దోర్బల ప్రభాకర్‌ శర్మ, పి.కృష్ణమాచార్యులు (శ్రీవైష్ణవ ఆగమం), నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి (వీరశైవ ఆగమం), మృత్యుంజయశర్మ (శైవాగమ శాస్త్ర పండితులు), బుట్టే వీరభద్ర సిద్ధాంతి(వాస్తు, జ్యోతిషం), జేకే సుబ్బారావు (వైదికం), బొద్దుపల్లి దాత్తాత్రేయ శర్మ (శాక్తేయ ఆగమం), ఖండవల్లి సూర్యనారాయణాచార్యులు (వైఖానస ఆగమం), అక్కి రాఘవేంద్రాచార్య (తంత్రసారం), కళ్లేపల్లి సుబ్రహ్మణ్యం (స్మార్త వైదికాగమనం), వారణాసి నాగభూషణం (గ్రామ దేవత), ఆర్వీవీవీ గోపాలాచార్య (పాంచరాత్రం) లను నియమించారు.

అంతేకాదు దేవాదాయ అర్చకులు, ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ బోర్డులో.. దేవాదాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, టీటీడీ ఈవో, టీటీడీ ఆర్థిక సలహాదారు, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, ఏపీ అర్చక సమాఖ్యకు చెందిన ఎ.ఆత్రేయబాబు, పి.శ్రీనివాసులు, హిందూ దేవాదాయ ధర్మాదాయ సంస్థల సిబ్బంది సంఘానికి చెందిన వి.శ్రీనివాస్‌లను సభ్యులుగా ఉన్నారు. అలాగే కార్యదర్శి, కోశాధికారిగా దేవాదాయ కమిషనర్‌ను నియమించారు.

అంతేకాదు ఈ ట్రస్టు బోర్డులో అనధికార సభ్యులైన పి.శ్రీనివాసులు, వి.శ్రీనివాస్‌, ఆత్రేయబాబులు మూడేళ్లు సభ్యులుగా కొనసాగుతారని తెలిపారు. రూ.20 లక్షలపైన వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలు, దేవాదాయ సంస్థల నుంచి 3% చొప్పున ఈ నిధి కింద వసూలు చేసి.. అర్చకులు, ఆలయాల్లో ఉద్యోగులకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు వినియోగిస్తారని చెప్పారు. మొత్తం ఏ ప్రభుత్వం దేవాదాయశాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది.

మరోవైపు దేవాదాయ శాఖ పరిధిలోని పలు దేవాలయాలను రూ.249.26 కోట్ల సి.జి.ఎఫ్. నిధులతో అభివృద్ది పర్చేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు కొట్టు సత్యనారాయణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోని దేవాలయాలను అభివృద్ది చేసేందుకు ఈ నిధులను వెచ్చిస్తున్నామన్నారు. అలాగే హిందూ మత ధర్మంపై విస్తృతమైన ప్రచారం కల్పించాలనే లక్ష్యంతో త్వరలో దేవాదాయ శాఖ ఆద్వర్యంలో పీఠాధిపతులు, మఠాధిపతుల విశిష్ట సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.