యాప్నగరం

కడప జిల్లావాసికి కీలక పదవి.. రూ. 2 లక్షల జీతంతో చంద్రహాసరెడ్డి నియామకం

ప్రవాసాంధ్రుల వ్యవహారాల ఉప సలహాదారుగా వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పెద్దమల్లి చంద్రహాసరెడ్డిని నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయనకు నెలకు రూ. 2 లక్షల జీతం చెల్లించనుంది.

Samayam Telugu 15 May 2020, 8:06 pm
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రుల వ్యవహారాల ఉప సలహాదారుగా పెద్దమల్లి చంద్రహాసరెడ్డిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవాసాంధ్రుల సేవలు, పెట్టుబడులకు సంబంధించి ఆయన సలహాలు అందజేస్తారు. ఈ పదవిలో చంద్రహాస రెడ్డి రెండేళ్ల పాటు కొనసాగుతారు. వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన పి.చంద్రహాసరెడ్డి అందించే సేవలకు ప్రభుత్వం నెలకు రూ.2 లక్షల వేతనంగా నిర్ణయించింది.
Samayam Telugu ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం


పీఎస్, పీఏ, డ్రైవర్, ఇతర అలవెన్సుల కోసం ప్రభుత్వం నెలకు రూ.70,000 అలవెన్సులు ఇవ్వనుంది. అలాగే వాహనం, ఇంధనం కోసం రూ. 60,000 మొబైల్, డేటా కోసం రూ.2000, నివాసానికి అద్దె కింద ప్రభుత్వ క్వార్టర్స్ లేదా రూ. 50,000 చెల్లించనున్నారు. భారత్‌లో ఆయన పర్యటించినప్పుడు టూ టైర్ ఏసీ, ఫ్లైట్‌లో ఎకానమీ క్లాస్‌లో పర్యటించవచ్చు.

అలాగే విదేశాలకు వెళ్లేటప్పుడు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం వెంకట్ ఎస్.మేడపాటి ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడిగా, ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. ఈ పదవిలో చంద్రహాసరెడ్డి రెండేళ్లపాటు కొనసాగుతారని ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.