యాప్నగరం

18 రోజులు మద్యం బంద్.. జగన్ సర్కార్ సంచలనం

Liquor Ban: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో 18 రోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు.

Samayam Telugu 9 Mar 2020, 9:58 pm
స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రకటించారు. ఈ నెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఆయా రోజుల్లో దుకాణాలకు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు అనిల్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
Samayam Telugu pjimage (86)


Also Read: చిరంజీవి లేకపోతే ఆత్మహత్యే గతి.. వాళ్లు చెప్పుతో కొట్టి పంపారు.. పృథ్వీరాజ్ షాకింగ్ వ్యాఖ్యలు

ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. 21న ఎంపీటీసీ స్థానాలకు, 23న మున్సిపల్‌, నగర పంచాయతీ, కార్పొరేషన్లకు ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 27, 29 తేదీల్లో రెండు దశల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read: బీసీలకు సీఎం జగన్ వరం.. టీడీపీకి దిమ్మతిరిగేలా..

మూడు దఫాలుగా ఏపీలో స్థానిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా.. రెండు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 660 జెడ్‌పీటీసీ, 9,639 ఎంపీటీసీలకు మొదటి దశలో ఎన్నికలు జరగనుండగా.. పంచాయతీలకు మరో దశలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇక మూడో దశలో మున్సిపాలీటీలకు ఎన్నికలు జరుగుతాయి.

Also Read: దొరబాబు వ్యభిచారం కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ప్చ్, అలా దొరికిపోయారు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.