యాప్నగరం

‘అమ్మ ఒడి’కి మరో రూ. 1,000 కోత.. ఇక, చేతికొచ్చేది రూ. 13 వేలే!

జగనన్న అమ్మ ఒడి పథకం లబ్ధిదారులకు అలర్ట్! రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 1,000 కోత పెట్టింది. దీంతో ఇకపై చేతికి రూ. 13 వేలు మాత్రమే అందనున్నాయి.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 21 May 2022, 7:48 am
Samayam Telugu జగనన్న అమ్మ ఒడి
‘జగనన్న అమ్మఒడి’ పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోతపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఇస్తున్న రూ. 15 వేలల్లో ఇప్పటికే రూ. 1,000 కోత పెట్టిన ప్రభుత్వం.. మరో రూ. వెయ్యి కట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో మొత్తంగా రూ. 2,000కు కోతపడనుంది. ఇప్పటికే మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.వెయ్యి తగ్గించగా.. ఇప్పుడు పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణకు మరో రూ. 1,000 మినహాయించేందుకు రాష్ట్ర సిద్ధమైంది.

ఈ పథకం కింద జూన్‌లో రూ. 13 వేలు మాత్రమే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. లబ్ధిదారుల నుంచి మినహాయించిన మొత్తాన్ని పాఠశాల విద్యా శాఖ ద్వారా పాఠశాలల నిర్వహణకు కేటాయిస్తారు. ఈ సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా స్థాయి అధికారులకు చేరవేశారు.

అలాగే, అమ్మఒడి పథకం అందాలంటే ప్రభుత్వం మరిన్ని నిబంధనలు జోడించింది. నవంబర్ 8వ తేదీ నుంచి ఏప్రిల్‌ 30 వరకు విద్యార్థి హాజరు 75 శాతం ఉంటేనే అమ్మ ఒడి డబ్బు అందుతుంది. అమ్మ ఒడి పథకాన్ని 2021-22 ఆర్థిక సంవత్సరంలో అసలు అమలు చేయలేదు. గతేడాది జనవరి 11న ఈ పథకం కింద తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా.. ఈ ఏడాది విద్యార్థుల హాజరు పేరుతో దీన్ని జూన్‌కు మార్చారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.