యాప్నగరం

నిర్ణయం మార్చుకున్న జగన్.. విశాఖ కాదు విజయవాడలోనే వేడుకలు?

మనసు మార్చుకున్న జగన్ సర్కార్.. రిపబ్లిక్ డే వేడుకలు విజయవాడలో నిర్వహించాలని నిర్ణయం. ముందు విశాఖలో నిర్వహించాలని భావించిన ప్రభుత్వం.. ఉన్నట్టుండి నిర్ణయంలో మార్పు.

Samayam Telugu 21 Jan 2020, 4:27 pm
రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందు విశాఖపట్నంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని భావించిన సర్కార్.. ఇప్పుడు ఉన్నట్టుండి నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. విశాఖలో కాకుండా విజయవాడలోనే వేడుకలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారట. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలుస్తోంది.
Samayam Telugu ys jagan.


జగన్ నిర్ణయం వెనుక ఆసక్తికర కారణాలు ఉన్నాయనే చర్చ మొదలయ్యింది. విజయవాడలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడం ద్వారా అమరావతి ప్రాంతంలో ప్రజలకు ఓ విధమైన భరోసా ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి భావిస్తున్నారట. అందుకే విశాఖలో కాకుండా బెజవాడవైపు మొగ్గు చూపారట. దీంతో నగరంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో వేడుకల్ని నిర్వహించనున్నారట.

జనవరి 26న రిపబ్లిక్ డేను వైజాగ్‌లోనే నిర్వహించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన రిహార్సల్‌ కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో.. ఉన్నట్టుండి నిర్ణయం మార్చుకోవడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు మరో ఐదు రోజులే సమయం ఉండటంతో విజయవాడలో ఏర్పాట్లు ఎలా చేస్తారన్నది చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.