ఏపీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. డిపోలు, యూనిట్లు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది.. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. ఆర్టీసీలో మొత్తం 5 వేల మంది ఔట్ సోర్సింగ్లో పనిచేస్తుండగా.. వీరు ప్రతి రోజూ తమ నివాసం నుంచి డిపో/యూనిట్లకు సొంత ఖర్చులతో ప్రయాణం చేస్తున్నారు. అందుకే ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని గత కొద్ది కాలంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు.
ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరికపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఆర్థిక వెసులుబాటు కల్పించే ఉద్ధేశంతో ఈ ఉచిత బస్పాస్లు మంజూరు చేస్తున్నట్లు ఎండీ కృష్ణబాబు తెలిపారు. సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఈ బస్ పాస్లు ఉపయోగించుకోవచ్చు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వారు తమ నివాసం నుంచి 25 కి.మీ.లోపు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు.
ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరికపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఆర్థిక వెసులుబాటు కల్పించే ఉద్ధేశంతో ఈ ఉచిత బస్పాస్లు మంజూరు చేస్తున్నట్లు ఎండీ కృష్ణబాబు తెలిపారు. సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఈ బస్ పాస్లు ఉపయోగించుకోవచ్చు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వారు తమ నివాసం నుంచి 25 కి.మీ.లోపు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు.