యాప్నగరం

ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Samayam Telugu 23 Jun 2020, 10:58 pm
కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఉద్ధృతమవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సర్కార్‌.. తాజాగా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, డిగ్రీ మొదటి, రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్ట్రార్‌లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించిన అనంతరం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చివరి సెమిషర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Samayam Telugu విద్యార్థులు


డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్‌ లేదా మార్కులపై నిర్ణయం నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక విశ్వవిద్యాయాల ఎగ్జిక్యూటివ్‌ కమిటీలు వీటిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.