యాప్నగరం

కరోనా ఎఫెక్ట్: ఏపీలో 38 ఎల్పీజీ దహన వాటికలు.. మంత్రి కీలక ప్రకటన

ఏపీలో కరోనా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో 38 ఎల్పీజీ దహన వాటికలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Samayam Telugu 29 Jul 2020, 5:11 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొత్తగా 38 ఎల్పీజీ దహన వాటికలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడి మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో నవంబర్ నాటికి రూ.51.48 కోట్లతో శ్మశాన వాటికల్లో వసతులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక దహన వాటిక ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
Samayam Telugu ఎల్పీజీ దహనవాటిక


ఈ పనులకు సంబంధించిన టెండరింగ్ ప్రక్రియను పూర్తి చేసి, వచ్చే నవంబరు నెలాఖరుకల్లా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి బొత్స వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో మరణించిన వారి అంతిమ సంస్కారాల నిర్వహణకు సరైన సదుపాయాలు లేవని గుర్తించామని.. అందుకే పర్యావరణ హితంగా ఎల్పీజీతో నిర్వహించేలా దహన వాటికల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. శ్మశానాల్లో మౌలిక వసతుల కల్పన చేపడతామన్నారు.

38 దహనవాటికల ఏర్పాటు కోసం రూ.15.92 కోట్లు, 35 శ్మశానాల్లో వసతుల కల్పనకు రూ.35.56 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఇటీవలి కాలంలో కొన్ని చోట్ల అంతిమ సంస్కారాల నిర్వహణలో దురదృష్టకరమైన కొన్ని అమానవీయ సంఘటనలు చోటుచోసుకున్నాయని.. ఇటువంటి సంఘటనలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశలో ప్రభుత్వం దహనవాటికల నిర్మాణం, శ్మశానాల్లో వసతుల కల్పన పనులను చేపడుతున్నామని పేర్కొన్నారు. అంత్యక్రియలనేవి గౌరవప్రదమైన రీతిలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.