యాప్నగరం

AP Curfew : రేపటి నుంచే కొత్త టైమింగ్స్‌ అమల్లోకి.. సడలింపులివే!

ఏపీలో కర్ఫ్యూ నిబంధనలను మరో పది రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో రెండు గంటల పాటు వెసులుబాటు కల్పించింది. కర్ఫ్యూ సడలింపులు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Samayam Telugu 10 Jun 2021, 7:05 pm
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూను ప్రభుత్వం మరికొద్దిరోజులు పొడిగించింది. ఇప్పటి వరకూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజలు బయటికొచ్చేందుకు అనుమతించింది. మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అయితే కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో జగన్ సర్కార్ కర్ఫ్యూ నిబంధనలను కొద్దిగా సడలించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
curfew


ఇప్పటి వరకూ మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజలు బయటికొచ్చేందుకు అనుమతులు ఉన్నాయి. పొడిగించిన కర్ఫ్యూ నిబంధనల సడలింపులో భాగంగా మరో రెండు గంటల సమయం పెంచింది. మధ్యాహ్నం 2 గంటల వరకూ దుకాణదారులు, ప్రజలు బయటికి వచ్చేందుకు అనుమతులిచ్చింది. రేపటి నుంచి కొత్త సడలింపులు అమల్లోకి రానున్నాయి. మరో పది రోజుల పాటు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి.

జూన్ 20 వ తేదీ వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు తెరుచుకోవచ్చు. 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రేపటి నుంచి ఈ నెల 20 వరకూ కర్ఫ్యూ సడలింపు అమలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సింఘాల్ కలెక్టర్లు, ఎస్పీలకు ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.