యాప్నగరం

ఏబీ వెంకటేశ్వరరావుకు మళ్లీ షాకిచ్చిన జగన్ సర్కార్

ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు జగన్ సర్కార్ షాకిచ్చింది. ​​వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు మళ్లీ..

Samayam Telugu 20 Jan 2021, 6:59 am
ఏపీ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు జగన్ సర్కార్ షాకిచ్చింది. ఆయనపై సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో ఆరునెలల పాటు సస్పెన్షన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సస్పెన్షన్‌ పొడిగింపు ఆగస్టు నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Samayam Telugu ఏబీ వెంకటేశ్వరరావు


వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతల నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారని.. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు డీజీపీ నివేదిక సమర్పించారని.. ఆ మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు ఆ సస్పెన్షన్‌‌ను పొడిగించింది.

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయంచారు. ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్‌పై గతంలో స్టే ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ క్రమంలో ఏబీ సస్పెన్షన్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఏబీ వెంకటేశ్వర్రావు.. 1989 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల సమయంలో ఫిర్యాదు మేరకు గత ఎన్నికలకు ముందు ఆయన్ను ఇంటెలిజన్స్ చీఫ్ పదవి నుంచి ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.