యాప్నగరం

కరోనా ఎఫెక్ట్: అమరావతి రైతులకు జగన్ సర్కార్ నోటీసులు

Coronavirus in AP: కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా రాజధాని ప్రాంతంలో దీక్ష విరమించాలని అమరావతి ప్రాంత రైతులకు వైసీపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

Samayam Telugu 21 Mar 2020, 9:28 pm
రాజధాని అమరావతి ప్రాంతంలో దీక్షలు చేస్తున్న వారికి వైసీపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ (కోవిడ్ 19) నివారణ చర్యల్లో భాగంగా వైద్య శాఖ అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. వెంటనే దీక్షా శిబిరాలను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. ఎర్రపాలెం, కృష్ణాయపాలెం, మందడం, రాయపూడి, వెలగపూడి పెదపరిమి, తుళ్లూరు దీక్షా శిబిరాల్లో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వెంటనే దీక్షా శిబిరాలను ఖాళీ చేయాలని నోటీసుల్లో సూచించారు.
Samayam Telugu pjimage - 2020-03-21T212732.290


అలాగే పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌ బహుజన పరిరక్షణ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సెస్‌ రహదారి డి- జంక్షన్‌ వద్ద చేపట్టిన దీక్షా శిబిరాలను కూడా ఖాళీ చేయాలని వైద్య శాఖ అధికారులు కోరారు. వికేంద్రీకరణకు మద్దతుగా చేపట్టిన దీక్షలు శనివారానికి 13వ రోజుకు చేరాయి.

కరోనా మహమ్మారి విజృంభించకుండా దేశంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆర్టీసీ బస్సు సేవలు, పెట్రోల్ బంకులు ఆదివారం నిలిచిపోనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.