యాప్నగరం

ఆ నాలుగు కులాలకు జగన్ సర్కార్ శుభవార్త.. వారి అకౌంట్లలో రూ.75వేలు

చేయూత పథకానికి సంబంధించి ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. కులధ్రువీకరణ పత్రం అవసరం లేకుండానే వైఎస్సార్‌ చేయూత పథకం వర్తింపు జేయాలని నిర్ణయించింది.

Samayam Telugu 9 Sep 2020, 11:23 am
ఏపీలో సంక్షేమ పథకాలతో జగన్ సర్కార్ దూసుకెళుతోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు పథకాలను తీసుకొచ్చింది. తాజాగా చేయూత పథకానికి సంబంధించి ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. బుడగ జంగం, వాల్మీకి, ఏనేటి కొంద్, బెంతొ ఒరియా కులాల వారికి కులధ్రువీకరణ పత్రం అవసరం లేకుండానే వైఎస్సార్‌ చేయూత పథకం వర్తింపు జేయాలని నిర్ణయించింది. ఈ నాలుగు కులాల వారు వివిధ కారణాలతో కులధ్రువీకరణ పత్రం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.. దీంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu ap government gives chance to another forecasts for ysr cheyutha scheme
ఆ నాలుగు కులాలకు జగన్ సర్కార్ శుభవార్త.. వారి అకౌంట్లలో రూ.75వేలు


కులధ్రువీకరణ పత్రం లేకపోవడం వల్ల ఆయా కులాల్లో పలువురు అర్హత ఉండి కూడా పథకం కింద లబ్ధి పొందలేకపోయారని పలువురు మంత్రులు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే సమస్యల్ని పరిశీలించి.. సీఎం కార్యాలయ ఆదేశాల మేరకు స్వయం కులధ్రువీకరణ పత్రంతోనే అర్హులకు వైఎస్సార్‌ చేయూత పథకాన్ని అందించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాల్లో 45–60 ఏళ్ల మధ్య ఉండే మహిళలకు నాలుగు విడతల్లో రూ.75 వేలు చెల్లించే వైఎస్సార్‌ చేయూత పథకాన్ని గత నెల 12న ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకానికి ఈ నాలుగు కులాల వారిలో అర్హులను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టినట్టు సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ఈ నాలుగు కులాలు కూడా చేయూత పథకానికి అర్హత సాధించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.