యాప్నగరం

జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. రైతు భరోసా పెంపు, ప్రజా ప్రతినిధులకూ ఛాన్స్

నెల్లూరు జిల్లాలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. సోమవారం వ్యవసాయ మిషన్‌పై సమీక్ష చేసిన సీఎం. రైతు భరోసాను రూ.12,500 నుంచి 13,500కు పెంచుతూ నిర్ణయం.

Samayam Telugu 14 Oct 2019, 2:46 pm
ఏపీలో రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం పెంచుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. భరోసాను రూ.12500 నుంచి 13500 పెంచుతున్నామని.. ఐదేళ్ల పాటు రూ.13500 ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలిపారు. మూడు విడతల్లో రైతు భరోసా డబ్బు పంపిణీ చేస్తామని.. మేలో రూ.7400, రబీలో రూ.4వేలు. సంక్రాంతి రూ.2వేలు అందజేస్తామన్నారు. వ్యవసాయ మిషన్‌పై ముఖ్యమంత్రి జగన్.. మంత్రులు, అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం మాట్లాడిన మంత్రి పలు కీలక ప్రకటనలు చేశారు.
Samayam Telugu jagan.


అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు.. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు రైతు భరోసా వర్తించదన్నారు మంత్రి. మిగిలిన ప్రజా ప్రతినిధులకు (జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు,సర్పంచ్‌లు) భరోసాకు అర్హులని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లాలో రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంరభించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల్ని కూడా విడుదల చేసింది. అలాగే జిల్లాలవారీగా రైతు భరోసా అర్హుల జాబితాలు సిద్ధమయ్యాయి.

రైతు భరోసాతో 50 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా కౌలు రైతులకు సైతం మంచి చేస్తున్నామని పేర్కొన్నారు. 3 లక్షల మంది కౌలు రైతులకు ఈ పథకం ద్వారా లబ్దిపొందుతారని చెప్పారు. మూడు విడతలుగా రైతు భరోసా సొమ్ము ఇస్తామన్నారు మంత్రి కన్నబాబు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.