ఏపీలో రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం పెంచుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. భరోసాను రూ.12500 నుంచి 13500 పెంచుతున్నామని.. ఐదేళ్ల పాటు రూ.13500 ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలిపారు. మూడు విడతల్లో రైతు భరోసా డబ్బు పంపిణీ చేస్తామని.. మేలో రూ.7400, రబీలో రూ.4వేలు. సంక్రాంతి రూ.2వేలు అందజేస్తామన్నారు. వ్యవసాయ మిషన్పై ముఖ్యమంత్రి జగన్.. మంత్రులు, అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం మాట్లాడిన మంత్రి పలు కీలక ప్రకటనలు చేశారు.
అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు.. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు రైతు భరోసా వర్తించదన్నారు మంత్రి. మిగిలిన ప్రజా ప్రతినిధులకు (జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు,సర్పంచ్లు) భరోసాకు అర్హులని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లాలో రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంరభించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల్ని కూడా విడుదల చేసింది. అలాగే జిల్లాలవారీగా రైతు భరోసా అర్హుల జాబితాలు సిద్ధమయ్యాయి.
రైతు భరోసాతో 50 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా కౌలు రైతులకు సైతం మంచి చేస్తున్నామని పేర్కొన్నారు. 3 లక్షల మంది కౌలు రైతులకు ఈ పథకం ద్వారా లబ్దిపొందుతారని చెప్పారు. మూడు విడతలుగా రైతు భరోసా సొమ్ము ఇస్తామన్నారు మంత్రి కన్నబాబు.
అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు.. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు రైతు భరోసా వర్తించదన్నారు మంత్రి. మిగిలిన ప్రజా ప్రతినిధులకు (జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు,సర్పంచ్లు) భరోసాకు అర్హులని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లాలో రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంరభించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల్ని కూడా విడుదల చేసింది. అలాగే జిల్లాలవారీగా రైతు భరోసా అర్హుల జాబితాలు సిద్ధమయ్యాయి.
రైతు భరోసాతో 50 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా కౌలు రైతులకు సైతం మంచి చేస్తున్నామని పేర్కొన్నారు. 3 లక్షల మంది కౌలు రైతులకు ఈ పథకం ద్వారా లబ్దిపొందుతారని చెప్పారు. మూడు విడతలుగా రైతు భరోసా సొమ్ము ఇస్తామన్నారు మంత్రి కన్నబాబు.