యాప్నగరం

ఏపీ ప్రజలకు అలర్ట్: ప్రభుత్వ ఆఫీసుల్లో టైమింగ్స్‌ మారాయ్.. వివరాలివే!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు పడిపోతున్న తరుణంలో సోమవారం నుంచి టైమింగ్స్ మారిపోనున్నాయి.

Samayam Telugu 20 Jun 2021, 11:40 pm
ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ సడలింపుల్లో భాగంగా సోమవారం (జూన్ 21) నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లా మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉద్యోగుల పని వేళలు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
Samayam Telugu ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు మార్పు


సోమవారం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనివేళలుగా నిర్ణయించినట్లు సీఎస్ ఆదిత్యనాథ్ తెలిపారు. మిగిలిన 12 జిల్లాల్లోని అన్ని ప్రాంతాలన్నింటిలోనూ కార్యకలాపాలు కోవిడ్‌ ముందున్న సమయాల తరహాలోనే కొనసాగనున్నాయి.

ఏపీ కర్ఫ్యూ వేళల్లో మార్పు.. ఇక, సాయంత్రం 6 వరకు.. ఈ ఒక్క జిల్లాలో తప్ప.. నిబంధనలివే!
సోమవారం నుంచి ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగులకు పని వేళలుగా నిర్ణయించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పనివేళలే వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది. అన్ని విభాగాధిపతులు, కలెక్టర్లు ఈ ఆదేశాలు అమలు చేయాలని సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.