ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగులను పూర్తిస్థాయిలో ఈహెచ్ఎస్ (ఎంప్లాయిస్ హెల్త్ స్కీం) పరిధిలోకి తీసుకొస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్కార్డుల జారీ ప్రక్రియ వేగంగా పూర్తిచేసేందుకు ప్రక్రియ ప్రారంభించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకి మూడురోజుల కిందట లేఖ రాశారు. సచివాలయాల్లో పనిచేసే అర్హులైన ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవలే ప్రొబేషన్ను ఖరారు చేసింది. వారికి జీతాలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఉద్యోగులను ఈహెచ్ఎస్ పరిధిలోకి తీసుకొస్తోంది. అర్హులైన సచివాలయాల ఉద్యోగులందరికీ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలో ఈహెచ్ఎస్ కార్డుల జారీకి గ్రామ, వార్డు సచివాలయశాఖ చర్యలు తీసుకుంటోంది. అంతేకాదు రెండు రోజుల క్రితం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్న సంగతి తెలిసిందే.
ప్రొబేషన్ సమయంలో విధి నిర్వహణలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించే కారుణ్య నియామకాలకు అవకాశం దక్కింది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కారుణ్య నియామకాలను చేపడతారు. కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలకు అనుమతించడంతో ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. సమస్యను చెప్పగానే స్పందించి నిర్ణయం తీసుకున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రొబేషన్ సమయంలో విధి నిర్వహణలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించే కారుణ్య నియామకాలకు అవకాశం దక్కింది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కారుణ్య నియామకాలను చేపడతారు. కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలకు అనుమతించడంతో ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. సమస్యను చెప్పగానే స్పందించి నిర్ణయం తీసుకున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.