యాప్నగరం

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. మొత్తానికి లైన్ క్లియర్, వచ్చే నెల నుంచే అమలు!

Apsrtc Employees Prc కి సంబంధించి లైన్ క్లియర్ అయ్యింది. మిగిలిన ఉద్యోగులకు కూడా పీఆర్సీ అమలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. గతేడాది సెప్టెంబర్‌లో బ్రేకులు.. మొత్తానికి తొలగిన అడ్డంకి.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 25 Feb 2023, 8:53 am

ప్రధానాంశాలు:

  • ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
  • 2096 ఉద్యోగులకు పీఆర్సీ అమలు
  • గతంలో ఆర్థికశాఖ అభ్యంతరాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Apsrtc Employees Prc
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వంలోని ప్రజా రవాణాశాఖ (పీటీడీ)లోకి ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు విలీనమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పదోన్నతి పొందిన 2,096 మందికి పీఆర్సీ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులు 2020 జనవరి ఒకటి నుంచి పీటీడీలోకి విలీనం అయ్యారు. ఆ తర్వాత వీరిలో 2,096 మందికి ఆర్టీసీ యాజమాన్యం పదోన్నతులు ఇచ్చింది.
డీపీసీ నిబంధనలకు విరుద్ధంగా.. ప్రభుత్వ అనుమతి లేకుండా వీరికి ప్రమోషన్ ఇచ్చారని ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. వీరికి మినహా, మిగిలిన ఉద్యోగులకు గతేడాది సెప్టెంబరు నుంచి పీఆర్సీ అమలు చేశారు. ఆ తర్వా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. దీంతో 2,096 మంది ఉద్యోగులకు ఈ ఒక్కసారికి పీఆర్సీ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తానికి 2,096 మందికి పీఆర్సీ అమలుకానుంది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.