యాప్నగరం

ఏపీలో మరో రెండు రోజులు కర్ఫ్యూ! స్వీయ నిర్బంధంలో సీఎం జగన్

Janata Curfew in AP: ఏపీలో మరో రెండు రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు సీఎం జగన్ ప్రకటిస్తారని సమాచారం.

Samayam Telugu 22 Mar 2020, 4:55 pm
ఏపీలో కరోనా వైరస్‌ (కోవిడ్ 19) పాజిటివ్ కేసులు ఐదుకు పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో మరో రెండు రోజులు కర్ఫ్యూ కొనసాగించే అవకాశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులతో సమాలోచనలు జరిపారు. జనతా కర్ఫ్యూ, కరోనా వైరస్‌ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌ సహా ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
Samayam Telugu pjimage - 2020-03-22T165433.102


విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారి పట్ల కేంద్రం నిర్దేశించిన నియమాలను పాటించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసులపై ఈ సమావేశంలో విస్తృతస్థాయిలో చర్చించారు. కరోనా అనుమానిత కేసులకు ఐసోలేషన్‌ వార్డులు, చికిత్స సదుపాయాలు, ఔషధాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

మరోవైపు జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం మొత్తం స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఇంట్లో ఉంటూనే రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షించారు. అలాగే రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఈ సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్‌ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన వివరించనున్నారు. ఈ సమావేశంలోనే కర్ఫ్యూ కొనసాగింపుపై సీఎం జగన్‌ ప్రకటన చేసే అవకాశముంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.