టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐలో భారీ అవినీతి జరిగినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి.
మందుల పేరిట వందల కోట్ల రూపాయలు స్వాహా చేశారని, మంత్రుల అండదండలతో ఆస్పత్రులకు మందులు సరఫరా చేయకుండానే బిల్లులు చేసుకున్నారన్న విమర్శలున్నాయి. మందుల కొనుగోళ్లలోనూ ప్రమాణాలు పాటించలేదని, ఆస్పత్రులకు గడువు ముగిసిన, అవసరం లేని మందులను సరఫరా చేశారని అభియోగాలున్నాయి. Read Also :గూడూరు - విజయవాడ మధ్య కొత్త రైలు..
సుమారు రూ.300 కోట్ల మేర అవినీతి జరిగిందని, ఈ బాగోతంలో మందుల సరఫరాదారులతో అధికారులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వచ్చాయి. టీడీపీ నేతల ప్రమేయంపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుమారు రూ.300 కోట్లు దారిమళ్లినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో ఈఎస్ఐ అవినీతి బాగోతంపై జగన్ సర్కార్ దృష్టి సారించింది.
ఈఎస్ఐలో అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించింది. రూ.300 కోట్ల అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ బాధ్యతలను ప్రభుత్వం కార్మిక శాఖ డైరెక్టర్కు అప్పగించింది.
మందుల పేరిట వందల కోట్ల రూపాయలు స్వాహా చేశారని, మంత్రుల అండదండలతో ఆస్పత్రులకు మందులు సరఫరా చేయకుండానే బిల్లులు చేసుకున్నారన్న విమర్శలున్నాయి. మందుల కొనుగోళ్లలోనూ ప్రమాణాలు పాటించలేదని, ఆస్పత్రులకు గడువు ముగిసిన, అవసరం లేని మందులను సరఫరా చేశారని అభియోగాలున్నాయి.
సుమారు రూ.300 కోట్ల మేర అవినీతి జరిగిందని, ఈ బాగోతంలో మందుల సరఫరాదారులతో అధికారులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వచ్చాయి. టీడీపీ నేతల ప్రమేయంపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుమారు రూ.300 కోట్లు దారిమళ్లినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో ఈఎస్ఐ అవినీతి బాగోతంపై జగన్ సర్కార్ దృష్టి సారించింది.
ఈఎస్ఐలో అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించింది. రూ.300 కోట్ల అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ బాధ్యతలను ప్రభుత్వం కార్మిక శాఖ డైరెక్టర్కు అప్పగించింది.