యాప్నగరం

ఏపీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పేర్లు ఖరారు.. అనూహ్యంగా ఆయనకు ఛాన్స్

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు రెండు పేర్లను ఖరారు. ఇద్దరి పేర్లను గవర్నర్‌కు పంపించిన ప్రభుత్వం. అనుకున్నట్లుగానే మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబుతో పాటూ రాయచోటికి చెందిన మహిళకు ఛాన్స్.

Samayam Telugu 21 Jul 2020, 6:21 am
ఏపీలో గవర్నర్ కోటా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పేర్లు ఖరారయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, కడప జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానమ్‌ పేర్లను వైఎస్సార్‌సీపీ ఖరారు చేయగా.. ఆ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు పంపించింది. పండుల రవీంద్రబాబు ఎస్సీ వర్గానికి చెందిన వారు కాగా, జకియా ఖానమ్‌ ముస్లిం మైనారిటీ మహిళా నేత
Samayam Telugu సీఎం జగన్


గతంలో టీడీపీ ఎంపీగా ఉన్న పండుల రవీంద్రబాబు.. 2019 ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీలో చేరారు. కానీ ఎంపీ టికెట్ దక్కకపోవడంతో.. మరో విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఇక కడప జిల్లాకు చెందిన జకియా ఖానుం భర్త పార్టీ కోసం పని చేస్తూ చనిపోయారు.. అందుకే ఆమెకు ఈ పదవి ఇచ్చారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేట సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌‌ పేరు కూడా ఎమ్మెల్సీ రేసులో వినిపించింది. ఆయనకు దాదాపు సీటు ఖాయం చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ ఈసారి ఆయనకు ఛాన్స్ దక్కలేదు. రాజశేఖర్ గత ఎన్నికల్లో పార్టీ కోసం చిలకలూరిపేట సీటు త్యాగం చేశారు. జగన్ కూడా ఎమ్మెల్సీ పదవి, కేబినెట్ బెర్త్ ఇస్తామన్నారు. అయితే ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కావడంతో ఆయన పేరు తెరపైకి వచ్చింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోసెస్ రాజు పేరు కూడా వినిపించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.