యాప్నగరం

మందుబాబులకు సీఎం జగన్ మరో దిమ్మతిరిగే షాక్.. ఈసారి టార్గెట్..!

YS Jagan Mohan Reddy: ఏపీలో మందుబాబులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో షాకిచ్చారు. మద్యం దుకాణాలను 33 శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Samayam Telugu 6 May 2020, 11:40 pm
మందుబాబులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఇప్పటికే మద్యం ధరలను ఆకాశాన్ని అంటే రీతిలో 75 శాతం మేర పెంచేసిన సీఎం జగన్.. తాజాగా, మద్యం దుకాణాలను తగ్గించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 13 శాతం మద్యం దుకాణాలు తొలగించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఓ ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu సీఎం జగన్ మద్యపాన నిషేధం


మద్యం దుకాణాలు తగ్గించాలన్న ముఖ్యమంత్రి జగన్ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 566 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 20 శాతం మద్యం షాపులను వైసీపీ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం 33 శాతం మద్యం దుకాణాలు క్లోజ్ కానున్నాయి.

దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా గతంలో 4,380 మద్యం షాపులకు గాను ఇకపై 2,934 షాపుల్లో మాత్రమే మద్యం అమ్మకాలు జరగనున్నాయి. మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం దుకాణాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వెల్లడించారు. కాగా, ఇప్పటికే మందుబాబులకు షాక్ కొట్టే రీతిలో లిక్కర్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. లిక్కర్ షాపులను కూడా తగ్గించాలన్న నిర్ణయంతో చాలా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ప్రజలకు సుదూరం కానున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.