యాప్నగరం

ఏపీలో అర్చకులు, పాస్టర్లు, ఇమాంలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5వేలు

Ap Pastors Salaries వచ్చేశాయి. ఈ మేరకు ప్రభుత్వం రూ.2కోట్ల 59 లక్షలు విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా 5196మందికి రూ.5వేల చొప్పున నిధులు విడుదల అయ్యాయి.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 19 Aug 2022, 6:43 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ys Jagan
రాష్ట్రంలో అర్చకులు, ఇమాం మౌజంలు, పాస్టర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మొదటి విడతలో 5196 మందికి నెలకు రూ. 5 వేల చొప్పున గౌరవ వేతనంగా అందించేందుకు నిధులు విడుదల చేశామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. గౌరవ వేతనం అందించేందుకు రూ. 2 కోట్ల 59లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. విజయవాడలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మొదటి విడతలో జాబితా ఆధారంగా పాస్టర్లకు బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేశామన్నారు. రాష్ట్రంలో అర్హత కలిగిన పేద ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలు చేసే దిశగా సీఎం జగన్ పని చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో, అంకిత భావంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.
మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి అర్హత కలిగిన లబ్దిదారులను గుర్తించి గౌరవ వేతనం ఇచ్చామన్నారు. మైనారిటీ వెల్ఫేర్ పోర్టల్‌ను విస్తరించి మిగిలిన అర్హత కలిగిన పాస్టర్‌లు అందరికీ గౌరవ వేతనం రెండవ విడతల్లో విడుదల చేయడానికి సైతం చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడిపిస్తూ, శాంతి భద్రతలను పర్వవేక్షిస్తూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలనను అందిస్తున్నదన్నారు.

అర్చకులు, ఇమాం మౌజంలతో పాటుగా పేదవర్గాల ప్రజలైన పాస్టర్లను గౌరవించి ఆదుకోవాలన్న పవిత్ర లక్ష్యంతో వారి ఆత్మభిమానం పెంపొందించే విధంగా ప్రభుత్వం గౌరవ వేతనం విడుదల చేసిందననారు. ఇది ప్రభుత్వ విజయమని.. ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ ను రూపొందించి ఆయా తేదీలు వారీగా నిర్దారించబడిన సంక్షేమ పథకాలను క్రమం తప్పకుండా అమలు చేస్తోందన్నారు. అర్హత కలిగిన పాస్టర్లను గుర్తించేందుకు వారిని గౌరవ వేతనం పరిధిలోనికి తెచ్చేందుకు నియమ నిబంధనలను సరళీకృతం చేసి.. మరింత మందికి గౌరవ వేతనం అందించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.