యాప్నగరం

ఏపీ: 'అమ్మ ఒడి' రూ.14వేలు, వెయ్యి కట్.. కారణం ఏంటంటే?

. కోవిడ్‌-19 కారణంగా విద్యార్థులందరికీ 75శాతం హాజరు నిబంధనను మినహాయించారు. ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నట్లు తెలిపారు.

Samayam Telugu 29 Dec 2020, 7:34 am
ఏపీలో వచ్చే నెల 9న అమ్మ ఒడికి శ్రీకారం చుట్టనున్నారు. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి అమ్మ ఒడి డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1 నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థుల తల్లులకు జనవరి 9న అమ్మఒడి కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈసారి తల్లుల అకౌంట్లలో రూ.14 వేలు మాత్రమే జమచేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ రూ. 1000ని పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ నిధి కింది మినహాయించనున్నట్టు తెలిపారు. రూ. 1000 జిల్లా మరుగుదొడ్ల నిర్వహణ నిధికి జమ చేయనున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.
Samayam Telugu అమ్మ ఒడి


2019-20లో ఈ సాయం అందుకున్న విద్యార్థులందరూ ఈ ఏడాది కూడా అర్హులేనని క్లారిటీ ఇచ్చారు. కోవిడ్‌-19 కారణంగా విద్యార్థులందరికీ 75శాతం హాజరు నిబంధనను మినహాయించారు. ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నట్లు తెలిపారు. 2019-20 విద్యా సంవత్సరానికి పదో తరగతి చదివి, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ పొందని విద్యార్థులు కూడా అమ్మ ఒడి పథకానికి అర్హులేనని స్పష్టం చేసింది. అయితే ఐటీఐ, పాలిటెక్నిక్‌, ట్రిపుల్‌ ఐటీ కోర్సులు ఎంచుకున్న పదో తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నందున అమ్మ ఒడి వర్తించదని ఉత్తుర్వుల్లో తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.