యాప్నగరం

ఏపీ: ఆరోగ్య శ్రీ కొత్త రూల్స్.. మధ్యతరగతికి బంపరాఫర్

ఆరోగ్య శ్రీకి సంబంధించిన మార్గదర్శకాలను విడదుల చేసిన ప్రభుత్వం. కొన్ని నిబంధనలను మార్చిన జగన్ సర్కార్.. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్రశ్రీ సేవలు ప్రారంభం.. జనవరి నుంచి ఏపీలో పూర్తిస్థాయిలో ఆరోగ్రశ్రీ సేవలు.

Samayam Telugu 15 Nov 2019, 1:41 pm
ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకు ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. అలాగే అన్ని రకాల బియ్యం కార్డు కలిగిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది కానీ.. కొన్ని నిబంధనులను విధించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
Samayam Telugu cm jagan


ఆరోగ్యశ్రీకి సంబంధించిన మార్గ దర్శకాలు ఇలా ఉన్నాయి.

*రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకానికి వర్తింపు.

* అన్ని రకాల బియ్యం కార్డులు ఉన్నవారు అర్హులు.

* వైఎస్సార్ పింఛన్, జగన్నన్న విద్యా, వసతి దీవేన కార్డుకు అర్హత ఉన్న కుటుంబాలు కూడా అర్హులు.

ఇతర కుటుంబాలకు, ఈ క్రింది ప్రమాణాలు వర్తిస్తాయి.

* 12 ఎకరాల కన్నా తక్కువ తడి భూమి.. 35 ఎకరాల కన్నా తక్కువ పొడి భూమి ఉన్న భూ యజమానులు అర్హులు.

* తడి, పొడి భూములు కలిపి మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారందరూ అర్హులు .

* రూ.5 లక్షలోపు వార్షిక ఆదాయం ఉన్నవాళ్లు అర్హసులు.

* రూ.5 లక్షల వరకు ఆదాయపు పన్ను దాఖలు చేస్తున్న కుటుంబాలు అర్హులు.

* 3000 ఎస్‌ఎఫ్‌టీ (334 చదరపు Yds) కన్నా తక్కువ ప్రాంతానికి మున్సిపల్ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలకు వర్తింపు.

* రూ.5 లక్షలోపు వార్షిక ఆదాయం ఉన్న అవుట్ సో ర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు అర్హులు.

* ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు అర్హులు.

* కుటుంబంలో ఒక కారు ఉన్నా వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపు.

* కుటుంబంలో ఒక కారు కన్నా ఎక్కువగా ఉంటే పథకానికి అనర్హులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.