యాప్నగరం

ఏపీ: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జగన్ సర్కార్ తీపి కబురు

నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రూ. 4,800.59 కోట్లకు ఓకే చెప్పింది. ఈ పథకం తొలి దశలో రాష్ట్రంలో 32 లక్షల ఇళ్లకు అవకాశం.

Samayam Telugu 6 Oct 2020, 10:39 am
ఏపీలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల తరహాలో ఇంటింటికీ మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.. దీని కోసం నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రూ. 4,800.59 కోట్లకు ఓకే చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 91,40,605 ఇళ్లు ఉంటే.. అందులో 33,88,160 ఇళ్లకు ఇప్పటికే కుళాయి కనెక్షన్లు ఉంటే.. మిగిలిన 57,52,445 ఇళ్లకు కుళాయి కనెక్షన్ల ఏర్పాటుకు రూ.10,975 కోట్లతో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జలజీవన మిషన్‌ పథకంలో భాగంగా 50% నిధులను కేంద్రం రాష్ట్రానికి ఇస్తుంది.
Samayam Telugu సీఎం జగన్


Read Also: ఏపీలో మహిళలకు శుభవార్త: 5,905 పోస్టులు భర్తీ.. టెన్త్ విద్యార్హత, వివరాలివే

ఈ పథకం తొలి దశలో రాష్ట్రంలో 32 లక్షల ఇళ్లకు నీటి కనెక్షన్ల ఏర్పాటుకు రూ.4,800.59 కోట్లకు అధికారులు పంపించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజూ 43.5 లీటర్ల నుంచి 55 లీటర్ల మధ్య వినియోగానికి వీలుగా మంచినీటి పథకాలు నిర్మితమైన చోట ఈ తొలి దశలో కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో వ్యక్తికి రోజూ 43.5 లీటర్ల కంటే తక్కువ పరిమాణంలో నీటి సరఫరా ఉన్న చోట.. ఆయా గ్రామాల్లోనూ మంచినీటి పథకాల సామర్థ్యం పెంచి రెండో దశలో ఆ గ్రామాల పరిధిలో ఉన్న మిగిలిన 25.52 లక్షల ఇళ్లకు కుళాయిలు ఏర్పాటు చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.