యాప్నగరం

హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉండే ఏపీ ప్రజలకు శుభవార్త

ఇకపై పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్య శ్రీ వర్తింపజేసిన జగన్ సర్కార్. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో కూడా సేవలు ప్రారంభించం. పోస్టర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.

Samayam Telugu 1 Nov 2019, 3:04 pm
హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉండే ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. ఆరోగ్య శ్రీ పథకాన్ని పొరుగు రాష్ట్రాల్లో కూడా అమలులోకి వచ్చింది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించిన పోస్టర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. 130 ఆస్పత్రుల్లో గుర్తించిన సూపర్‌ స్పెషాలిటీ సేవలను జగన్ ప్రారంభించారు. ఇక హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో కూడా 17 సూపర్‌ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి 716 వ్యాధులకు వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఏపీకి చెందిన రోగులు ఎవరైనా ఆయా నగరాల్లో ఆరోగ్యశ్రీ అనుబంధ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందొచ్చు.
Samayam Telugu arogya sri.


Read Also: ఏపీ: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జగన్ సర్కార్ ఊరట

పోస్టర్‌ను ఆవిష్కరించిన తర్వాత.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెన్నైలోని ఎంఐఓటీ, బెంగుళూరులోని ఫోర్టిస్, హైదరాబాద్‌లోని మెడ్‌కవర్‌ ఆసుపత్రుల డాక్టర్లు, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీకి చెందిన పేషెంట్లను జాగ్రత్తగా చూసుకోవాలంటూ జగన్ డాక్టర్లను కోరారు. పేషెంట్లు కోలుకునేంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Must Read: జగన్ చెప్పినట్లుగానే.. పోలవరం పనులకు శ్రీకారం

జగన్ పాదయాత్ర, ఎన్నికల సమయంలో ఆరోగ్య శ్రీని పొరుగు రాష్ట్రాల్లో కూడా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన నగరాలైన చెన్నై, హైదరాబాద్, బెంగళూరులోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.