యాప్నగరం

ఏపీలో వారికి శుభవార్త.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.10వేలు

Ysr Matsyakara Bharosa కి సంబంధించి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. మే రెండో వారంలో అకౌంట్‌లలో డబ్బులు జమ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ పక్రియను షురూ చేసింది. ప్రతి ఏటా వేట విరామ సమయంలో మత్స్యకారులకు సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆ సాయాన్ని అందజేయనున్నారు. ఈ నెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి అర్హులను గుర్తించనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 15 Apr 2023, 6:06 am

ప్రధానాంశాలు:

  • ఏపీలో మత్స్యకారులకు సర్కార్ శుభవార్త
  • వైఎస్సార్ మత్స్యకార భరోసాపై కసరత్తు
  • మే నెల రెండో వారంలో అకౌంట్‌లో డబ్బు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ysr Matsyakara Bharosa Scheme
ఏపీలో మత్స్యకారులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం సముద్రంలో చేపల పునరుత్పత్తి కావడంతో వేట నిషేధం అమల్లోకి వస్తోంది. దీంతో ప్రభుత్వం మే నెల రెండోవారంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. మత్స్యకార కుటుంబాలకు వేట విరామ సమయంలో రూ.10 వేలు ఇస్తోంది. జగన్ సర్కార్ గడిచిన నాలుగేళ్లలో 4.14 లక్షల మందికి రూ.414.49 కోట్ల భృతిని అందించింది.
వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకానికి అర్హుల్ని గుర్తించేందుకు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ నెల 17 నుంచి ఆర్బీకేల్లో పనిచేసే గ్రామ మత్స్య సహాయకునితో పాటు వాలంటీర్, సాగరమిత్రలతో టీమ్‌లు లబ్ధిదారులను గుర్తించనున్నారు. ఆ రోజు తీరంలో లంగరేసిన బోట్లను పరిశీలించి వివరాలు నమోదు చేస్తారు. ఈ గుర్తింపు సమయంలో బోటు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, ఫిషింగ్‌ లైసెన్సు, ఆధార్, రైస్‌కార్డుతోపాటు బ్యాంకు అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

అనంతరం ఈ నెల 18న గ్రామ సచివాలయంలో ఈ డేటాను అప్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత ఆరు దశల వెరిఫికేషన్‌ ఉంటుంది. అనంతరం అర్హుల జాబితాలను సామాజిక తనిఖీకి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. ఈ పథకం కింద అనర్హత పొందిన వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అర్హత తుది జాబితాలను సిద్ధం చేస్తారు. ఈ నెలాఖరులోగా ఈ మొత్తం ప్రక్రియ పూర్తిచేసేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేసింది.

ఈ పథకానికి 18–60 ఏళ్ల వయసు ఉండేవాళ్లు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, అర్బన్‌ ప్రాంతాల్లో 1.44 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉండాలి. అలాగే సంక్షేమ పథకాలు పొందినవారు, మత్స్యకార పింఛన్‌ పొందుతున్నవారు, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగాలు చేస్తున్నవారు అనర్హులు. 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట, రెండు కలిపి 10 ఎకరాలకు మించి భూమి ఉన్నవాళ్లకు పథకం వర్తించదు.

అర్బన్‌ ప్రాంతాల్లో కనీసం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి ఇల్లు ఉంటే అనర్హులు. అలాగే పథకానికి ఆదాయపన్ను చెల్లింపుదారులు కూడా అనర్హులు. అంతేకాదు డీజిల్‌ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కి పెంచింది ప్రభుత్వం. అంతేకాదు వేట విరామాన్ని ఉల్లంఘించిన వారి బోట్లను సీజ్‌ చేయడమేగాక సంక్షేమ పథకాలు కట్‌ చేస్తారు. సముద్రంలో 61 రోజుల పాటు వేట నిషేధం అమల్లో ఉండనుంది.. శనివారం అర్ధరాత్రి నుంచి నిషేధం అమల్లోకి రానుంది.. దీంతో బోట్లన్నీ సముద్రం ఒడ్డుకు చేరుకుంటున్నాయి.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.