యాప్నగరం

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు తీపి కబురు.. ఈ నెల నుంచే పక్కా!

Ap Village And Ward Secretariat Employees జీతాలు ఈ నెల నుంచి పెరగనున్నాయి. కొత్త పీఆర్సీ, పేస్కేలు, ప్రకారం పెరిగిన వేతనాలు ఇవ్వున్నారు. ఈ మేరకు ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 26 Jul 2022, 6:04 am

ప్రధానాంశాలు:

  • గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త
  • ఈ నెల నుంచే పెరిగిన జీతాలు అమలు చేస్తారు
  • ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించిన ఆర్థికశాఖ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Village Secretariat Employees
ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల (Ap Village And Ward Secretariat Employees)కు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రొబేషన్‌ ఖరారు అనంతరం ఈ నెల నుంచే కొత్త పీఆర్సీ పేస్కేలు ప్రకారం పెరిగిన వేతనాలు ఇవ్వనున్నారు.. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగులకు పే స్కేలుతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్స్‌లు కలిపిన వేతనాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖలో కొత్తగా అదనపు బడ్జెట్‌ కేటాయింపులు చేసింది. వేతనాల కోసం కేటాయించిన రూ.768.60 కోట్ల అదనపు నిధులను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాల కోసం ఇప్పటికే రూ. 1,995 కోట్లు విడుదల చేయగా.. తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం రూ. 2,763.60 కోట్లు విడుదల చేసినట్లు. వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పెరిగిన వేతనాలు ఈ నెల నుంచి రానున్నాయి. ఇందుకు అదనపు నిధులపై ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సచివాలయాల ఉద్యోగులకు కొత్త వేతనాలు చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్‌కు ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

వార్డు సచివాలయాల ఉద్యోగులకు పెరిగిన జీతాల జీవో కూడా వేరుగా విడుదలవుతుందన్నారు. ప్రొబేషన్‌ డిక్లేర్‌ అయిన ఉద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని.. అందరికీ పే స్కేల్‌ ప్రకారం జీతాలు వస్తాయన్నారు. ఇచ్చిన హామీ మేరకు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు, పెరిగిన వేతనాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ధన్యవాదాలు తెలిపారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.