యాప్నగరం

కరోనా బాధితుడి పేరు బయటకు చెబితే అరెస్టే.. జగన్ సర్కార్ హెచ్చరిక

కరోనా వైరస్ బాధితుడికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని బయటకు చెబితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది.

Samayam Telugu 28 Mar 2020, 3:43 pm
కరోనా వైరస్ (కోవిడ్ 19) బారిన పడ్డ వారి పేర్లు, వారి వివరాలను బహిర్గతపరచడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా దీన్ని అతిక్రమించి కరోనా బాధితుల వివరాలు బహిర్గతపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Samayam Telugu pjimage - 2020-03-24T170917.657


‘‘కోవిడ్ 19కు సంబంధించిన ఎలాంటి రహస్య సమాచారాన్ని (బాధితుడి వ్యక్తిగత సమాచారం, ల్యాబ్ రిపోర్టులు, మొదలైనవి) అయినా ప్రజలతో పంచుకోవడం పూర్తిగా నిషేధం. దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయి. రహస్య సమాచారాన్ని ఇతరులకు చేరవేసే వారు ఎవరైనా కనిపిస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాల్సిగా కోరుతున్నాం.’’ అని వైద్య, ఆరోగ్య శాఖ ట్వీట్ చేసింది.

కోవిడ్ 19ను కట్టడి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అలాగే కరోనా బాధితులకు రక్షణ కల్పించడంలో సైతం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా బాధితుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రచారం చేయడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.