యాప్నగరం

సీఎం జగన్‌కు మళ్లీ చిక్కులు: ఏపీలో మరో ఉద్యమం.. తిరగబడ్డ ఉపాధ్యాయులు!

ఏపీలో పీఆర్సీ వ్యవహారంపై మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిక్కొచ్చి పడింది. ఆందోళనకు దిగబోతున్నట్లు ఉపాధ్యాయ సంఘాల ప్రకటన!

Samayam Telugu 6 Feb 2022, 10:26 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో చిక్కు వచ్చిపడింది. పీఆర్సీకి సంబంధించి అంతా సుఖాంతమైందని అనుకుంటున్న తరుణంలో.. ప్రభుత్వ ఉపాధ్యాయులు ట్విస్ట్ ఇచ్చారు. పీఆర్సీ జీవోల వల్ల తమకు న్యాయం జరగలేదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పలు ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.
Samayam Telugu ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు


సోమవారం నుంచి శుక్రవారం వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకానున్నారు. శుక్రవారం అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వనున్నట్టు ఫ్యాప్టో ప్రతినిధులు తెలిపారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాల్లో 12 ఉద్యోగ సంఘాలు పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈమేరకు ఉద్యమ కార్యచరణ వివరాలను ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వరప్రసాదరావు వెల్లడించారు.

గుంటూరులో ఏపీటీఎఫ్‌ నిరసన ప్రదర్శన
మెరుగైన పీఆర్సీ కోసం ఉపాధ్యాయ సంఘాలు కలిసి పోరాటం సాగిస్తాయని ఏపీటీఎఫ్‌ గుంటూరు జిల్లా అధ్యక్షుడు బసవలింగారావు స్పష్టం చేశారు. స్టీరింగ్‌ కమిటీ తీరును నిరసిస్తూ గుంటూరు జిల్లా కోర్టు ఎదుట ఏపీటీఎఫ్‌ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పీఆర్సీ ఒప్పంద పత్రాలను దగ్ధం చేశారు. మెరుగైన పీఆర్సీ కోసం ఉద్యమం కొనసాగుతుందన్న ఆయన.. అన్ని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

ఏపీ జేఏసీలో నాలుగు సంఘాల నాయకులు ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్లకు తీరని అన్యాయం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. తక్షణమే పాత హెచ్‌ఆర్‌ఏ ప్రకటించాలని, పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 27శాతం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, తక్షణమే స్టీరింగ్‌ కమిటీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.