యాప్నగరం

ఏపీలో అర్హత ఉండీ ఇప్పటివరకు పథకాలు అందనివారికి శుభవార్త

అర్హత ఉండీ ప్రభుత్వ పథకాలు అందనివారికి అండగా ఉండేందుకు గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. లబ్ధిదారుల వివరాలు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారు.

Samayam Telugu 7 Nov 2020, 7:29 am
ఏపీలో అర్హత ఉండీ ఇప్పటి వరకు పథకాలు అందనివారికి శుభవార్త. అర్హత ఉండీ సాయం అందని వారికి శనివారం నుంచి ఆయా పథకాల కింద సాయం అందించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. వైఎస్సార్‌ కాపునేస్తం, వాహనమిత్ర, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, వైఎస్సార్‌ చేయూత పథకాలకు అర్హులై ఉండీ లబ్ధి కలగని 4.39 లక్షల మందికి ఈనెలలో వాటిని వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. శనివారం కాపునేస్తం, 9న వాహనమిత్ర, 10న జగనన్న చేదోడు, 11న నేతన్న నేస్తం, 12న చేయూత పథకాల కింద 4.39 లక్షల మందికి ఆర్థిక సాయం అందజేయనున్నారు.
Samayam Telugu సీఎం జగన్


అర్హత ఉండీ ప్రభుత్వ పథకాలు అందనివారికి అండగా ఉండేందుకు గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. లబ్ధిదారుల వివరాలు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారు. ఇప్పటికే ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో అర్హులు అందిరికి ప్రయోజనం కలిగింది. వివిధ కారణాలతో చాలామందికి పథకాలకు దూరమయ్యారు. దీంతో ప్రభుత్వం మళ్లీ మళ్లీ వర్తింపజేస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.