యాప్నగరం

ఏపీలో డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు

Ysr Asara Funds Release On March 25th దెందలూరులో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటారు. సీఎం బటన్ నొక్కి అకౌంట్‌లలోకి డబ్బుల్ని జమ చేయనున్నారు. ఏప్రిల్ 5 వరకు ఈ పంపిణీ కార్యక్రమం జరగనుంది. వైఎస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళల రుణాలను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం నాలుగు దశల్లో డబ్బుల్ని చెల్లిస్తోంది.. ఇప్పుడు మూడో విడత డబ్బుల్ని అకౌంట్‌లో వేస్తున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 23 Mar 2023, 11:51 am

ప్రధానాంశాలు:

  • ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త
  • ఈ నెల 25న అకౌంట్‌లలోకి డబ్బులు
  • వైఎస్సార్ ఆసరా మూడో విడత నిధులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ysr Asara Funds Release On March 25th
Ap Dwcra Woman Asara Funds: ఏపీలో డ్వాక్రా మమిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వైఎస్సార్ ఆసరా మూడో విడత నిధులను ప్రభుత్వం అకౌంట్‌లలో జమచేయనుంది. ఈ మేరకు డబ్బులు విడుదలకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈనెల 25న ఏలూరు జిల్లా దెందలూరులో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఏప్రిల్ 5 వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
2019 ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాలకు ఉన్న అప్పును చెల్లిస్తామని వైఎస్ జగన్ గతంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇప్పటికే 2 విడతల్లో రూ.12,758 కోట్లను అర్హుల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్ ఆసరా మూడో విడత పథకం కింద78.94 లక్షలమంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.6,149 కోట్ల మొత్తాన్నిసీఎం జగన్ జమ చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా మూడో విడత పంపిణీ ఉత్సవాలను పది రోజుల పాటు నిర్వహించనుంది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్‌ 5 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నేరుగా లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడతార. అలాగే పంపిణీ కార్యక్రమాలకు స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీలతోపాటు సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు.

అంతేకాదు మార్చి 14 నుంచి 17 వరకు గ్రామ, వార్డు వాలంటీర్లు, గ్రామ సమాఖ్య సహాయకులు (వీవోఏ), పట్టణ రిసోర్స్‌ పర్సన్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మూడో విడతలో ఎంత లబ్ధి చేకూరుతుందో తెలియజేశారు. అలాగే మార్చి 18 నుంచి 20 వరకు సెర్ప్‌ కమ్యూనిటీ కోర్డినేటర్లు ఆయా పొదుపు సంఘాల సభ్యులందరితో సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ నెల 21న సచివాలయాల వారీగా సమావేశాలు ప్రారంభం అయ్యాయి.

ఈ వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు తీసుకున్నటువంటి రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 2019 ఏప్రిల్ 11 వరకు మహిళలు తీసుకున్నటువంటి రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వారికి 4 దశల్లో చెల్లిస్తుంది. వైఎస్సార్ ఆసరా పథకం అర్హుల పేర్లను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచారు. ఒకవేళ ఏవైనా అనుమానాలు ఉంటే.. హెల్ప్‌లైన్ నంబర్- 0863-2347302 ఇమెయిల్ ఐడి - supportmepma@apmepma.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.