యాప్నగరం

ఏపీ మహిళలకు అలర్ట్: ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ. 18,500 జమ.. వివరాలివే!

ఏపీ ప్రభుత్వం బుధవారం జగనన్న చేయూత పథకాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు మంత్రి వేణుగోపాల కృష్ణ వివరాలు వెల్లడించారు.

Samayam Telugu 12 Aug 2020, 2:25 pm
రాష్జ్రవ్యాప్తంగా ఉన్న 45 నుంచి 60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు బుధవారం (ఆగస్టు 12) ‘జగనన్న చేయూత’ పథకం ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగనన్న చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రతి ఏడాదికి 18,750 రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. అంటే వచ్చే నాలుగేళ్లలో ఆయా వర్గాలకు చెందిన మహిళలకు రూ. 75 వేలు ఆర్థిక సహయం అందనుందన్నారు.
Samayam Telugu పాదయాత్రలో సీఎం జగన్ వెంట నడుస్తున్న మహిళలు


ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది మహిళలకు గాను ఈ ఏడాది రూ. 4,700 కోట్లు కేటాయించినట్లు మంత్రి వేణుగోపాల కృష్ణ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తాను ఉండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

అలాగే విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ హోటల్లో జరిగిన దుర్ఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఉండి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అవలంభిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.