యాప్నగరం

Breaking : ఎమ్మెల్సీ జాబితాకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. సీఎం కలిసిన గంటల్లోనే..

ఏపీ శాసన మండలి అభ్యర్థుల జాబితాకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం గంటల వ్యవధిలోనే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైల్‌పై ఆమోదముద్ర పడింది.

Samayam Telugu 14 Jun 2021, 7:47 pm
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఖాళీ అయిన నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రతిపాదిస్తూ ప్రభుత్వం పంపిన జాబితాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి తోట త్రిమూర్తులు, పశ్చిమ గోదావరికి చెందిన మోషేను రాజు, గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి, సీఎం సొంత జిల్లా కడపకు చెందిన ఆర్వీ రమేష్ యాదవ్‌లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారు. సీఎం జగన్ భేటీ అనంతరం కొద్దిసేపటికే గవర్నర్ కార్యాలయం ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాకి ఆమోదం తెలపడం విశేషం.
Samayam Telugu నామినేట్ అయిన ఎమ్మెల్సీలు
ap mlc


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.