యాప్నగరం

గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు ఏపీలో ఓటు హక్కు.. ఏ నియోజకవర్గం అంటే!

ఏపీలో ఓటు హక్కు పొందని గవర్నర్ హరిచందన్.. ఓటు కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్న గవర్నర్ దంపతులు. దగ్గరుండి ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వ అధికారులు.

Samayam Telugu 10 Mar 2020, 3:07 pm
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఏపీలో ఓటు హక్కు పొందారు. హరిచందన్, సతీమణితో కలిసి ఓటు కోసం దరఖాస్తు చేసుకోగా. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో ఓటు నమోదు ప్రక్రియను.. ఎన్నికల విభాగపు డిప్యూటీ తహిశిల్దార్ నాయమణి దగ్గరుండి పూర్తి చేయించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే జిల్లా కలెక్టర్‌ గవర్నర్‌ దంపతులకు ఓటరు కార్డును అందచేయనున్నారు.
Samayam Telugu governor


ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్ హరిచందన్ 2019లో ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన అక్కడి నుంచి ఓటును విజయవాడకు మార్చుకున్నారు.. కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు స్థానికంగా ఓటు రావడంతో ఈ నెలలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గవర్నర్ దంపతులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

2019కు ముందు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా నరసింహన్ గవర్నర్‌గా ఉన్నారు. ఎన్నికల తర్వాత కేంద్రం పలు రాష్ట్రాలకు గవర్నర్‌లను మార్చేసింది. ఈ క్రమంలోనే బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు. ఆయన గతంలో ఒడిశా బీజేపీలో కీలక నేతగా పనిచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.