యాప్నగరం

నిమ్మగడ్డ కేసులో సంచలనం.. జగన్ సర్కార్‌కు గవర్నర్ కీలక ఆదేశాలు

సోమవారం రోజే నిమ్మగడ్డ గవర్నర్‌ను కలిశారు.. తనను ఎస్‌ఈసీగా కొనసాగించాలని వినిపత్రం అందజేశారు. రెండు రోజుల తర్వాత హరిచందన్ నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా కొనసాగించాలని జగన్ సర్కార్‌ను ఆదేశించారు.

Samayam Telugu 22 Jul 2020, 12:06 pm
ఏపీ ఎస్‌ఈసీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎస్‌ఈసీగా కొనసాగించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈమేరకు లేఖ రాసినట్లు సమాచారం. సోమవారం రోజే నిమ్మగడ్డ గవర్నర్‌ను కలిశారు.. తనను ఎస్‌ఈసీగా కొనసాగించాలని వినిపత్రం అందజేశారు. రెండు రోజుల తర్వాత హరిచందన్ నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా కొనసాగించాలని జగన్ సర్కార్‌ను ఆదేశించారు. మరి ప్రభుత్వం దీనిపై అడుగు ఎలా ముందుకు వేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Samayam Telugu నిమ్మగడ్డ రమేష్ కుమార్


Read Also: విజయసాయి హైదరాబాద్ ఎందుకెళ్లారు.. అల్లుడి వైద్యంపై నమ్మకం లేదా: మాజీ మంత్రి

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సోమవారం రోజు మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సమావేశమయ్యారు. తనను ఎస్‌ఈసీగా పునర్నియామకం చేయాలంటూ గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. హైకోర్టు తీర్పుతో పాటూ మిగిలిన అంశాలపై గవర్నర్‌తో చర్చించారు. తిరిగి తనను ఎస్‌ఈసీగా నియమించాలని కోరారు.. హైకోర్టు తీర్పును అమలు పరచాలని.. తిరిగి తనను ఎస్‌ఈసీగా నియమించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అడిగారు.

Also Read: విజయసాయిరెడ్డి త్వరగా కోలుకోవాలి.. టీడీపీ నేతలు, తెలుగు తమ్ముళ్ల ట్వీట్‌లు

తనను ఎస్ఈసీగా నియమించకపోవడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తీర్పుపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించినా నిమ్మగడ్డను ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. ఏపీ హైకోర్టు నిమ్మగడ్డకు కీలక సూచనలు చేసింది. గవర్నర్‌ను కలవాలని నిమ్మగడ్డను ఆదేశించింది.. వినతిపత్రం ఇవ్వాలని సూచించింది. హైకోర్గు తీర్పు అమలు చేయాలని గవర్నర్‌‌ను కోరాలని చెప్పింది. అయితే గవర్నర్‌ను కలవడానికి అపాయింట్‌మెంట్ తీసుకున్నామన్న నిమ్మగడ్డ లాయర్ కోర్టుకు తెలిపారు.

నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎస్ఈసీగా ఉన్న సమయంలో కోవిడ్ 19 వ్యాప్తి చెందుతున్న తరుణంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జగన్ సర్కార్.. ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి ఆయన్ను పదవి నుంచి తొలగించింది. దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. కానీ స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. తాజాగా, ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.