యాప్నగరం

ఆ బిల్లులపై న్యాయ సలహా తీసుకుంటున్న ఏపీ గవర్నర్‌.. అందరిలోనూ అదే ఉత్కంఠ

ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ న్యాయ సలహాలు తీసుకుంటున్నారు.

Samayam Telugu 24 Jul 2020, 5:00 pm
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఈ మేరకు శుక్రవారం రాజ్‌భవన్‌ అధికారులు, సీనియర్‌ న్యాయవాదులతో ఆయన సమావేశమయ్యారు. ఈ బిల్లులకు సంబంధించి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. చర్చల అనంతరం ఈ బిల్లులపై ఆయన తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Samayam Telugu గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్


వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లులను రెండోసారి రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి జూన్ 17వ తేదీన ఈ బిల్లులను శాసన మండలికి పంపారు. ఆ రోజు బిల్లులను ప్రవేశపెట్టక ముందే శాసన మండలి నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభ నుంచి రెండోసారి మండలికి పంపినందున అక్కడ చర్చ, ఆమోదాలతో సంబంధం లేకుండా నెల రోజులకు స్వయంచాలితంగానే (ఆటోమేటిక్‌) ఆమోదం పొందినట్లు పరిగణిస్తారనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన.

గత నెల 17న మండలికి పంపిన ఈ బిల్లులకు ఈ నెల 17తో ఈ వ్యవధి ముగిసిందని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్లే తుది ఆమోదానికి గవర్నర్‌కు శనివారం పంపినట్లు చెబుతున్నారు. గత జనవరిలో తొలిసారి బిల్లులను శాసనసభలో ఆమోదించి మండలికి పంపారు. వీటిని మండలి చైర్మన్‌ అప్పట్లో సెలక్ట్ కమిటీకి పంపించారు. ఈ తరుణంలో బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.