యాప్నగరం

రాజ్‌భవన్‌లో నలుగురికి కరోనా, గవర్నర్‌కు పరీక్షలు.. జగన్ సర్కార్ ప్రకటన

రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి వెల్లడించారు.

Samayam Telugu 28 Apr 2020, 9:15 pm
ఏపీ రాజ్‌భవన్‌ సిబ్బంది నలుగురికి కరోనా వైరస్ మహమ్మారి సోకిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్‌కు కూడా కరోనా పరీక్షలు చేశామని.. ఆయనకు నెగిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో స్టాఫ్‌ నర్సులను రిక్రూట్‌ చేయాల్సి ఉందన్నారు.
Samayam Telugu విశ్వభూషణ్ హరిచందన్


మొత్తం 9 వైరాలజీ ల్యాబ్‌ల ద్వారా పరీక్షలు పెంచామని, మొత్తం 8 జిల్లాల్లో వైరాలజీ ల్యాబ్‌లు ఉన్నాయని చెప్పారు. మరో మూడు జిల్లాల్లో ల్యాబ్‌లు రానున్నాయని వెల్లడించారు. మిగిలిన రెండు జిల్లాల్లోనూ త్వరలోనే ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కాగా, రాజ్‌భవన్‌లో నలుగురికి కరోనా సోకినట్లు రెండు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 258 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 970 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 31 మంది మరణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.