యాప్నగరం

ఢిల్లీకి ఏపీ గవర్నర్ హరిచందన్.. సడన్ టూర్‌పై ఆసక్తికర చర్చ

హస్తిన పర్యటనకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. శనివారం ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశం. గవర్నర్ ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లడంపై ఆసక్తికర చర్చ.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 22 Apr 2022, 7:41 pm

ప్రధానాంశాలు:

  • ఢిల్లీ పర్యటనకు ఏపీ గవర్నర్ హరిచందన్
  • శనివారం హస్తినలో ప్రధాని, రాష్ట్రపతితో భేటీ
  • సోమవారం వరకూ ఢిల్లీలోనే బిశ్వభూషణ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu గవర్నర్ హరిచందన్
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీ పర్యటన ఖాయమైంది. గవర్నర్ శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీతో భేటీకానున్నారు. శనివారం సాయంత్రం రాష్ట్రపతి కోవింద్‌తో హరిచందన్‌ సమావేశం అవుతారు. సోమవారం వరకూ గవర్నర్ హరిచందన్ హస్తినలోనే ఉండనున్నారు. ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో గవర్నర్ హరిచందన్ పాల్గొననున్నారు. ఇటీవలే తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారు.. ఇప్పుడు ఏపీ గవర్నర్ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఈ పర్యటనకు ఎలాంటి ప్రాధాన్యత లేదని.. మర్యాదపూర్వక సమావేశమని చెబుతున్నారు. ప్రధానితో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన ఏవైనా అంశాలు ప్రస్తావనకు వస్తాయా అన్నది చూడాలి.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.