యాప్నగరం

ఏపీ గవర్నర్ మంచి మనసు.. ఏడాది పాటూ జీతంలో!

ప్రధాని పిలుపు మేరకు తన వేతనం తగ్గించాలని రాష్ట్రపతికి లేఖను రాశారు. గవర్నర్ హరిచందన్ తన వేతనంలో ఏడాది పాటు ముప్పై శాతం తీసుకోవాలని కోరారు.. తన అంగీకారాన్ని లేఖలో ప్రస్తావించారు.

Samayam Telugu 8 Apr 2020, 8:01 am
కరోనా వంటి కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వాలకు తమవంతుగా సాయం ప్రకటిస్తున్నారు. పీఎం, సీఎంల రిలీఫ్ ఫండ్‌కు సాయం అందిస్తున్నారు. అయితే ఏపీ గవర్నర్ మరో అడుగు ముందుకు వేసి తన పెద్ద మనసు చాటుకున్నారు. ప్రధాని పిలుపు మేరకు తన వేతనం తగ్గించాలని రాష్ట్రపతికి లేఖను రాశారు. గవర్నర్ హరిచందన్ తన వేతనంలో ఏడాది పాటు ముప్పై శాతం తీసుకోవాలని కోరారు.. తన అంగీకారాన్ని లేఖలో ప్రస్తావించారు.
Samayam Telugu ap governor


గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలతో రాజ్ భవన్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి లేఖ రాస్తూ తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసే క్రమంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని.. ఈ క్రమంలో అర్ధిక పరమైన వెసులుబాటు తప్పనిసరని సూచించారు.

కరోనా వంటి కష్ట కాలంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతుండటంతో.. ఎంపీల జీతాలు, పెన్షన్లలో ఏడాదిపాటు 30 శాతం కోత విధించాలని సోమవారం కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు కూడా తమ వేతనాలను 30 శాతం మేర తగ్గించుకోవాలని స్వచ్ఛందంగా నిర్ణయించారు. ఈ సేవింగ్స్ మొత్తాన్ని కోవిడ్‌పై పోరాటానికి ఫండ్‌ కోసం మళ్లించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.