యాప్నగరం

మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

దసరా ఆదివారం రావడవంతో ఆ రోజు ఎలాగూ సెలవే కాబట్టి ప్రత్యేకంగా పండగ సెలవు లేదని భావించారు. సెలవుపై గందరగోళం ఏర్పడటంతో ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది.

Samayam Telugu 24 Oct 2020, 8:59 am
ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 26న ఆపన్షల్‌ హాలిడేగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారుర. దసరా ఆదివారం కావడంతో సెలవును సోమవారానికి మార్చాలని సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేయడంతో.. ప్రభుత్వం ఓకే చెప్పింది. మహిళా ఉద్యోగులకు 26న సెలవు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
Samayam Telugu సీఎం జగన్


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరాకి ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుపై గందరగోళం ఏర్పడింది. సెలవుపై గందరగోళం ఏర్పడటంతో ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. దసరా ఆదివారం రావడవంతో ఆ రోజు ఎలాగూ సెలవే కాబట్టి ప్రత్యేకంగా పండగ సెలవు లేదని భావించారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం ఈనెల 26న దసరా సెలవును ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు కేంద్రం 26న ఆప్షనల్ సెలవుగా ప్రకటించింది. ఏపీ ఉద్యోగులు కూడా కోరడంతో ప్రభుత్వం ఓకే చెప్పింది. మహిళా ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది కాబట్టి... మిగతా ఉద్యోగులు సోమవారం విధులకు రావాల్సి ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.