యాప్నగరం

Amaravati Farmersకు జగన్ సర్కార్ వరాలు

అమరావతి రైతుల కోసం ప్రత్యేకంగా వరాలు ప్రకటించిన జగన్ సర్కార్. రైతు కూలీలకు పింఛన్ పెంచడంతో పాటూ కౌలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి బొత్స.

Samayam Telugu 20 Jan 2020, 3:11 pm
మూడు రాజధానుల వైపు మొగ్గు చూపిన జగన్ సర్కార్.. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. ఏపీ డిసెంట్రలైజేషన్‌ అండ్‌ ఈక్వల్‌ డెవలప్‌మెంట్ రీజియన్‌ యాక్ట్‌ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లుల్ని తీసుకొచ్చింది. AMDA బిల్లుపై మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో మాట్లాడారు. అమరావతి ప్రాంత రైతులకు ఇచ్చే ప్యాకేజీపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.. ఏపీ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు, రైతులకు ప్రభుత్వం ఇస్తున్న వరాలను ప్రకటించారు.
Samayam Telugu jagan.


రాజధాని ప్రాంతంలో రైతు కూలీలకు ఇస్తున్న పింఛన్లను రూ. 2500 నుంచి రూ.5వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. రాజధానికి భూములు ఇచ్చిన పట్టారైతులతో సమానంగా అసైన్డ్‌ భూములు ఇచ్చిన అసైన్డ్‌ దారులకు రిటర్న్‌ ప్లాట్ల కేటాయిస్తామన్నారు. రైతులకు ఇచ్చే కౌలును పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

గత ప్రభుత్వం అమరావతి రైతులకు జరీబు భూములైతే రూ.50 వేలు, మెట్టభూమికి రూ.30 వేలు.. పదేళ్లు ఇవ్వాలని నిర్ణయించారని సభలో ప్రస్తావించారు. జగన్ సర్కార్ దీన్ని జరీబుకు రూ.5వేలు.. మెట్ట భూములకు రూ.3వేలు పెంచాలని గతంలో నిర్ణయం తీసుకున్నట్లు బొత్స తెలిపారు. 10 ఏళ్ల తర్వాత జరీబు భూమికి ఇచ్చే యాన్యునిటీ రూ.లక్ష, మెట్ట భూమికి రూ.60 వేలు అవుతుందని.. ఇప్పుడు ఒప్పందం ఉన్న 10 ఏళ్ల తర్వాత వచ్చే ఐదేళ్ల పాటు కూడా ఇదే రీతిలో యాన్యునిటీని చెల్లిస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఈ వరాలపై అమరావతి రైతులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి ఒకే చెబుతారా.. తిరస్కరిస్తారన్నది చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.