యాప్నగరం

సీఎం జగన్‌కు సలహాదారు.. రాజస్థాన్ నుంచి పిలుపు.. కేబినెట్ హోదా

నిధుల సమీకరణ వ్యవహారాల కోసం ఆయనను నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సుభాష్‌ చంద్ర గార్గ్‌కు కేబినెట్‌ హోదా కల్పిస్తూ రెండేళ్ల పాటూ కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Samayam Telugu 2 Mar 2020, 10:31 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సలహాదారుడి (ఆర్థిక వనరుల సమీకరణ)గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుభాష్‌ చంద్ర గార్గ్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. నిధుల సమీకరణ వ్యవహారాల కోసం ఆయనను నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సుభాష్‌ చంద్ర గార్గ్‌కు కేబినెట్‌ హోదా కల్పిస్తూ రెండేళ్ల పాటూ కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జారీ చేసింది. మరోవైపు, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్న కార్తికేయ మిశ్రాను ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి(ఆర్థిక వనరుల సమీకరణ)గా నియమించింది. ఏపీ ఆర్థిక సంస్థ ఎండీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొంది.
Samayam Telugu subhash.


సుభాష్‌ చంద్ర గార్గ్‌కు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది. సుభాష్ 1983 రాజస్థాన్‌ కేడర్‌ ఐఏఎస్ అధికారి.. గతంలో ఈయన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా, ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. ఈయన ఏపీలో రెండేళ్ల పాటూ సలహాదారుగా సేవలు అందించనున్నారు. జగన్ సర్కార్ పాలనా సౌలభ్యం కోసం గతంలో పలువురు సలహాదారుల్ని నియమించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.