యాప్నగరం

Big Breaking : ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దు.. దిగొచ్చిన జగన్ సర్కార్

టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరతామని చెప్పిన ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో జగన్ సర్కార్ దిగొచ్చింది. రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 24 Jun 2021, 8:14 pm
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
exams cancel
ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్దిసేపటికి కిందట ప్రకటించారు. విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు.

సుప్రీం కోర్టులో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై విచారణ జరిగిందని మంత్రి పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు 45 రోజుల సమయం పడుతుందన్నారు. కానీ సుప్రీం చెప్పిన విధంగా వచ్చే నెల 31 నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదని భావిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సురేష్ అన్నారు. ఇంటర్, టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మార్కుల అసెస్మెంట్ కోసం హైపవర్ కమిటీని నియమిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.