యాప్నగరం

AP Capital రాజధానిపై హైపవర్ కమిటీ ఏర్పాటు.. ఆధ్యక్షుడిగా ఆ మంత్రి, కన్వీనర్‌గా సీఎస్

గత ప్రభుత్వ హాయంలో రాజధాని ప్రకటనకు ముందు ఆరు నెలల్లో అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు చేతులు మారాయని.. రాష్ట్రంలో ఎక్కడా కొనుగోలు చేయకుండా ఇక్కడే ఎందుకు కొనుగోలు చేశారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Samayam Telugu 29 Dec 2019, 12:11 pm
ఏపీ రాజధానిపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. క్యాబినెట్ నిర్ణయం మేరకు 16 మంది సభ్యులతో హైపవర్ కమిటీని ఆదివారం ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షత ఏర్పాటుచేసిన ఈ కమిటీ మూడు వారాల్లో నివేదిక ఇవ్వనుంది. కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వ్యవహరిస్తారు. ఇందులో మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, మేకపాటి గౌతమ్ రెడ్డి, మేకతోటి సుచరిత, కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆదిమూలపు సురేశ్, పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ సహా అజయ్ కల్లం, డీజీపీ గౌతమ్ సవాంగ్ సభ్యులుగా ఉంటారు.
Samayam Telugu cabi.


Read Also:
చలి గుప్పిట్లో ఉత్తరాది.. ద్రాస్‌లో మైనస్ 28 డిగ్రీల ఉష్ణోగ్రత

జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ నివేదికలపై హైపవర్ కమిటీ చర్చించి మూడు వారాల్లోగా నివేదికను అందజేయనుంది. హైపవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే రాజధాని అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి 3 తర్వాత బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక వచ్చే అవకాశం ఉండగా ఆ తర్వాతే రాజధానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read Also: తిరుపతిలో బాంబు పేలుళ్లు.. ఉలిక్కిపడ్డ ఆధ్యాత్మిక క్షేత్రం

అమరావతి పేరుతో భారీ స్కామ్‌ జరిగిందని.. రాజధాని ప్రకటనకు ముందే వేల ఎకరాలు చేతులు మారాయని వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఆరోపిప్తోంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా రాజధానిలో 4,070 ఎకరాలు చేతులు మారినట్లు గుర్తించామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అమరావతిలో జరిగిన అవినీతిని హైపవర్ కమిటీ వెలికితీస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కమిటీ నివేదికకు ప్రాధాన్యత సంతరించుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.