యాప్నగరం

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్

ఏపీలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోషన్ కల్పిస్తూ నిర్ణయం. పరీక్షలు నిర్వహించి పరిస్థితి లేకుపోవడంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం.

Samayam Telugu 26 Mar 2020, 1:56 pm
జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్, లాక్‌డౌన్ నేపథ్యంలో స్కూల్ విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతికి ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే హాజరును బట్టి పై తరగతులకు వెళ్లేలా అవకాశం కల్పించింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియా సమావేశంలో ప్రకటించారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ ప్రకటించడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు కూడా ఇది వర్తిస్తుంది.
Samayam Telugu ys


కరోనా వ్యాప్తి చెందుతుండటంతో జగన్ సర్కార్ స్కూళ్లకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అలాగే ఏపీపీఎస్సీతో పాటూ మరికొన్ని పరీక్షలు వాయిదా వేశారు. తాజాగా స్కూల్ విద్యార్థులకు విద్యా సంవత్సరం చివర్లో నిర్వహించే పరీక్షలు జరిపే అవకాశం లేకపోవడంతో.. పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

జగన్ సర్కార్ మాత్రమే కాదు తమిళనాడు ప్రభుత్వం కూడా పరీక్షలు లేకుండా విద్యార్థుల్ని పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా చాలావరకు రాష్ట్రాలు ఇదే బాటలో ఉన్నాయి. పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయానికి వచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.