యాప్నగరం

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. గుంటూరు, బెజవాడవాసులకు..

ఉగాది రోజున 25లక్షలమందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న జగన్ సర్కార్. గుంటూరు జిల్లా, విజయవాడవాసులకు ఇళ్ల పట్టాల కోసం సీఆర్డీఏ ప్రాంతంలోని స్థలాలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం.

Samayam Telugu 25 Feb 2020, 2:49 pm
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది రోజున 25లక్షలమందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇక గుంటూరు, విజయవాడలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం జగన్ సర్కార్ అమరావతిని ఎంచుకుంది. అమరావతిలో ఉన్న స్థలాలు గుంటూరు జిల్లాతో పాటూ విజయవాడవాసులకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జీవో జారీ చేసింది.
Samayam Telugu jagan.


పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా అమరావతి పరిధిలో సేకరించిన భూముల వివరాలను విడుదల చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అర్హులకు అమరావతి, సీఆర్డీఏ పరిధిలోని ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి జీవో విడుదల చేసింది.సీఆర్డీఏ పరిధిలోని తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాలతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో భూములు సేకరించారు.

మొత్తం 54,307మంది లబ్ధిదారులకు 1251.5 ఎకరాలు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అమరావతిలో ఐనవోలు, కురగల్లు, నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, మందడంలో భూములను అర్హులకు ఇవ్వనున్నారు. ఇటీవలే అమరావతి ప్రాంతంలో స్థలాల సర్వేకు వెళుతున్న దుగ్గిరాల ఎమ్మార్వోను రైతులు అడ్డగించారు.. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రభుత్వ అధికారిణిని అడ్డుకున్నందుకు రైతులపై కేసులు కూడా నమోదు చేశారు.
See Photo Story: మహాత్ముడికి ట్రంప్ నివాళులు... రాష్ట్రపతి భవన్‌లో ఇవాంకా సందడి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.